సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published: Wednesday May 12, 2021
పటాన్ చేరు, మే11 (ప్రజాపాలన ప్రతినిధి) : అభివృద్ధి పనుల విషయంలో జాప్యం చేయకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్ చేరు డివిజన్ పరిధిలోని కటిక బస్తీలో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి జరిగే సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవ్వడం సహజమేనని అన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిని ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: