చిలుకా నగర్లో పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Published: Friday February 18, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : చిల్కానగర్ ప్రధాన రహదారిలో జిల్లెల్ల సతీష్ రెడ్డి ఏర్పాటు చేసిన పిక్ అండ్ బై అధునాతన కొత్త సూపర్ మార్కెట్ ను గురువారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ ఎం.రజిత పరమేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. నగరంలో అనేక ప్రాంతాలలో ఇప్పటికే పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. కొత్తగా చిలుకానగర్లో 8వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఒకే దగ్గర లభించే ఇటువంటి సూపర్ మార్కెట్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత జిల్లెల్ల కృష్ణారెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. పిక్ అండ్ బై సూపర్ మార్కెట్ నిర్వాహకులు జిల్లెల్ల సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాదరణ చూరగొన్న పిక్ అండ్ బై సూపర్ మార్కెట్లు చిలుకా నగర్లో కూడా విజయవంతం అవుతుందని తెలిపారు. నాణ్యమైన అన్ని రకాల నిత్యావసర సరుకులు ఇందులో లభిస్తాయి అని తెలిపారు. చిలుకానగర్లో 8వ బ్రాంచ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత జిల్లెల్ల కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.