మున్సిపాలిటీ భవనాలు ఆక్రమణలపై విచారణ తాసిల్దార్
Published: Wednesday February 02, 2022
మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ భవనాలు ఆక్రమణకు గురైన విషయంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్లు మధిర తహసిల్దార్ రాజేష్ విలేకరులకు తెలిపారు. దీనిపై గతంలోనే కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ పురపాలక శాఖ అధికారులు కలిసి జాయింట్ ఎంక్వయిరీ చేయాలని ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆక్రమణల విషయంలో పూర్తి స్థాయి నివేదిక అందజేస్తానని తహసిల్దార్ తెలిపారు.
Share this on your social network: