పాఠశాల కళాశాల వద్ద విద్యార్థులకు టీకాలు : దేవరుప్పల

Published: Friday January 07, 2022
హైదరాబాద్ 06 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు జనవరి 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. జనగాం జిల్లా దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో 15-18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు పాఠశాల మరియు కళాశాలల్లో టీకాలు వేయడం జరుగుతుందని వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు. కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక సర్పంచ్ శ్రీమతి బేతిలినా రెడ్డి ఆధ్వర్యంలో టీకాలు వేయడం జరిగిందన్నారు. అదేవిదంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాధపురంలో కూడా అర్హత గల విద్యార్థులకు టీకాలు వేయడం జరిగిందని దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి తెలిపారు. మండలంలోని విద్యార్థులకు టీకా  టార్గెట్ ను పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు.