ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Published: Saturday December 10, 2022

బోనకల్, డిసెంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పాలనను దేశంలో అందించే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా తెలంగాణను సాధించి యావత్ దేశానికే ఆదర్శంగా సేవలందిస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత్ రాష్ట్ర సమితిగా ఎన్నికల సంఘం నుండి అధికార పత్రం పొందిన శుభ సందర్భంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశానుసారం బిఆర్ఎస్ బోనకల్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు సారధ్యంలో స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డు నందు ఘనంగా వేడుకలు నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు,పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం పరిచారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జై భారత్ రాష్ట్ర సమితి.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్ , ఇటికాల శ్రీను, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, కొనకంచి నాగరాజు , బిఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు ,గద్దల వెంకటేశ్వర్లు , ఎనగల మురళి, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సైదా, రావినూతల గ్రామ రైతు కన్వీనర్ షేక్ జానీ , పిల్లం వెంకటేశ్వర్లు , గంధసిరి కృష్ణ , బొమ్మకంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.