అమీర్ పేట్ లో నేడే 50 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం....

Published: Thursday October 14, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : అమీర్ పేట్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 50 పడకల ఆసుపత్రిని నేడు మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. గత సంవత్సరమే నిర్మితమైన ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే మంత్రి తలసాని చొరవతో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. బుధవారం ప్రారంభోత్సవ పనులను అధికారులు, మాజీ కార్పొరేటర్ శేషు కుమారితో కలిసి మంత్రి తలసాని సెక్రెటరీ పవన్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శేషు కుమారి మాట్లాడుతూ  మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభిస్తారని, మహమూద్ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్, నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని వారు తెలిపారు.