పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Published: Saturday October 08, 2022
జన్నారం, అక్టోబర్ 07, ప్రజాపాలన:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత బాలుర పాఠశాల 1995-96  పదవ తరగతి విద్యార్థుల బృందం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత బాలుర పాఠశాలలో 1995 96 కలిసి చదివిన విద్యార్థులు విద్యార్థినిలు ఒకచోట చేరి అలనాటి మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని బృందానికి బోధించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు వారిని పిలిచి సన్మానించారు. మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం పూర్వజన్మలో చేసుకున్న భాగ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area