అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన మేయర్, డిప్యూటీ మేయర్

Published: Thursday June 17, 2021
మేడిపల్లి, జూన్16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 23వ డివిజన్ సాయి నగర్ కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ అంచనా రూ 5.00 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఎన్.మధుసూదన్ రెడ్డితో కలిసి నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుతేదారు చంద్రశేఖర్, కాలనీ వాసులు టి.వెంకట్ రావు, జెట్ట అరుణ్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.