మట్టి గణపతులను పూజిద్దాం - పర్యావరణాన్నీ కాపాడుదాం

Published: Monday August 29, 2022
ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల. పంపిణీ
                                                                                 శేరిలింగంపల్లి- ప్రజాపాలన/ఆగస్ట్ 28 : పర్యావరణ. పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని బీజేపీ నేత, ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లోని మక్తా లో ఆదివారం రోజు ఆర్.కె.వై.టీమ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణo పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి వ్యక్తి కూడా పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని కోరారు. . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, జాజెరావు శ్రీను, శివరాజ్, రాము, వినోద్, బాబు, రామకృష్ణ, నరేష్, శివ, శ్రీకాంత్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.