చెర్లకొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణి కార్యక్రమం

Published: Friday July 01, 2022

రాయికల్, జూన్ 30 (ప్రజా పాలనా ప్రతి నిధి):
రాయికల్ మండలం లోని చెర్లకొండాపూర్ గ్రామ పాఠశాలను ఈ రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాయికల్ బ్రాంచ్ మేనేజర్ గౌతమ్ కుమార్  సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాబార్డు వారు మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు పలకలు, నోటుబుక్స్ మరియు పెన్స్ అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్ లక్ష్మినారాయణ, పాఠశాల చైర్మన్ వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనటం జరిగింది.