మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే
Published: Tuesday November 22, 2022
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో. మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు శాలువతో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను చర్చించుకోవడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం సీనియర్ నాయకులు , మరియు బూర్గంపాడు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు, బూర్గంపాడు జడ్పిటిసి శ్రీ కామిరెడ్డి శ్రీలత, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: