బెల్లంపల్లి పట్టణంలోకొత్త రేషన్ కార్డుల పంపిణీ

Published: Tuesday July 27, 2021

బెల్లంపల్లి, జూలై 26, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ అద్యక్షత వహించగా జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి శ్యామల దేవి, మండల రెవెన్యూ అధికారి కుమారస్వామి, పాల్గొని లబ్ధిదారులకు నూతన కార్డులను అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డిఓ శ్యామల దేవి మాట్లాడుతూ 2018లో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు బెల్లంపల్లి పట్టణంలో దాదాపు 550 మందికి నూతన కార్డులను అందించడం జరుగుతుందని, మిగతా ఎవరైనా ఉంటే తదుపరి నమోదు చేసుకోన్నట్లయితే  వారికి కూడా అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు, రాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని విడతలవారీగా అందరికీ అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, ముఖ్యఅతిథి ఆర్డిఓ శ్యామలా దేవి, బెల్లంపల్లి మండల రెవెన్యూ అధికారి కుమారస్వామి, పట్టణ 34 వార్డుల కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తెరాస నాయకులు, తదితరులు హాజరయ్యారు.