రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న మండల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

Published: Tuesday December 28, 2021
బోనకల్, డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న బోనకల్ మండల కాంగ్రెస్ నాయకులను బోనకల్ పోలీస్ సిబ్బంది తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడం సరైనది కాదని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రెండో పంట సాగు, ధాన్యం కొనుగోలు పై రైతులకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడిపల్లి కిశోర్ కుమార్,వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య భద్రు నాయక్, బోనకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరీదు శ్రీను, చింతేటి సురేష్ లు ఉన్నారు.