వృద్ధులకు సహాయ సహకారాలు అందించిన కార్పోరేటర్

Published: Tuesday June 08, 2021
బాలపూర్, జూన్ 07, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా సమయంలో పుట్టినరోజు వేడుకలను నిరాకరించామని చెప్పిన ఆచార్య పిలుపుమేరకు నిరుపేదలకు సహాయ సహకారాలు అందించిన పసునూరి బిక్షపతి చారి. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో తిరుమల హిల్స్ కాలనీలో సురక్షణ అనాధ వృద్ధాశ్రమంలో ఆచారి జన్మదిన వేడుకలు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి పండ్లుతో పాటు శానిటైజర్, మాస్కులు అందజేశారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ..... జాతీయ బీసీ కమిషన్ సభ్యులు పేదల పెన్నిధి బడుగు బలహీన ఆశాజ్యోతి నా రాజకీయ గురువు ఆచారి జన్మదిన ఉత్సాహాలను నిరుపేదలకు సాయంలో ఆయన పిలుపు మేరకు అనాధ ఆశ్రమం వృద్ధుల మధ్య జరుపుకున్నందుకు మనసుకు ఉల్లాసంగా ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధాశ్రమం వృద్ధులు అందరికీ పండ్లు, శానిటైజర్ తో పాటు మాస్కులు ఇచ్చి, ఆశ్రమం వారికి ఏ అవసరాలు ఉన్న తనకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హరినాథ్ రెడ్డి, ఓబిసి నాయకులు లక్ష్మణ్ చారి, సాయి, గోపాల్, శివ కుమార్ చారి, కాలనీ అధ్యక్షుడు జనార్ధన్ చారి, ట్రైజరర్ శ్రీనివాస్ చారి, కలకొండ శ్రీనివాస చారి, శ్రీనివాస్ చారి, వెంకటష్ చారి తదితరులు పాల్గొన్నారు.