గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

Published: Thursday September 09, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : గణేష్ పండుగను పురస్కరించుకొని యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం గార్డెన్ లో మండలం లోని ప్రజాప్రతినిధుల తో ఉత్సవ నిర్వాహకుల తో యాచారం సిఐ లింగయ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలని నారు. ఇందులో భాగంగా. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయం తో పని చేయాలన్నారు. చెరువుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ లను కోరారు హెల్త్ డెపార్ట్మెంట్ అప్రమత్థంగా ఉండాలన్నారు, శాంతి భద్రతల విఘాతం కలగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొప్పు సుకన్య, సర్పంచ్ లు  శ్రీనివాస్ రెడ్డి, హాబీబ్, జంగయ్య, పేద్దులు, రమేష్, ఎస్ఐ ప్రభాకర్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.