బూర్గంపాడు తాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన వరద అఖిలభారత రైతు కూలీ సంఘం. నాయ

Published: Thursday December 15, 2022
బూర్గంపాడు (ప్రజాపాలన.) 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రాన్ని అందజేసిన గోదావరి నది వరద ముంపు బాధితుల పోరాట కమిటీ నాయకులు.
 గోదావరి వరద ముంపు బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని  డిసెంబర్ 18న గోదావరిలో వరద బాధితుల జలదీక్ష  ఉదయం 10 గంటలకు సారపాకలో ప్రదర్శన,  ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జల దీక్ష కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానిస్తూ బూర్గంపహాడ్ తహసీల్దార్  భగవాన్ రెడ్డి కి  ఆహ్వాన పత్రాన్ని అందజేసినారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత  రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ హుక్ల, పిఓడబ్ల్యు  నాయకురాలు పెదగోని ఆదిలక్ష్మి, నాయకులు జక్కం కొండలరావు, పున్నంచంద్, వరద బాధితుల పోరాట కమిటీ నాయకులు  బట్టు రవి, ఇర్ప మనోజ్, ఎట్టి లక్ష్మణ్, కురసం సుజాత, భూలక్ష్మి తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.