మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Published: Monday June 14, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల కేంద్రంలో ఇటీవల కరోనాతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ శానకొండ గిరిబాబు కుటుంబానికి తన మిత్రుడు పైళ్ల శ్రీనివాస్ రెడ్డి,వారి మిత్రబృందం ఆర్ధిక సహాయం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిబాబు కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి వివరించగానే  తాను నివాసం ఉంటున్న హైదరాబాద్,చందానగర్ లోని గిరిజా మార్వెల్  అపార్ట్మెంట్ వాసులతో పాటు తన సహోద్యోగులు ఎన్ ఆర్ ఐ మిత్రులు కూడా స్పందించారని ఆయన అన్నారు.తన సహచర మిత్రుల నుంచి సేకరించిన మొత్తాన్ని గిరిబాబు భార్య మాధవికి రూ.2.15 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.ఈ మొత్తాన్ని ఇద్దరు పిల్లల పేరుమీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు.ఈ మొత్తం సేకరించడానికి సహకరించిన క్రాంతి పోత్నాక్,కొండూరు ఫణి (అమెరికా),జ్యోతి (యూ.కే),రామాదేవి, కుంభం ప్రదీప్ రెడ్డిలతో పాటు సహకరించిన సహచర మిత్రులందరికీ  ధన్యవాదాలు తెలిపారు. గిరిబాబు లాంటి మంచి మిత్రుణ్ణి కోల్పోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు.భవిష్యత్ లో గిరిబాబు కుటుంబానికి  అండగా ఉంటామని,పిల్లల చదువులకు భవిష్యత్ లో కూడా సహకారం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో పైళ్ల శ్రీనివాస్ రెడ్డి,పందిరి శ్రవణ్,శ్రీపాద సతీష్ పాల్గొన్నారు.