లాక్ డౌన్ సమయంలో బయటికి వస్తే వెయ్యి రూపాయలు వదిలినట్టే ట్రైనీ ఎస్సై కుశక్ కుమార్
Published: Saturday May 22, 2021
పాలేరు మే 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి స్థానిక పిఎస్ ఆర్ సెంటర్ వాహన తనిఖీలు నిర్వహించిన. ట్రైనీ ఎస్సై కుశక్ కుమార్, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఇండ్లల్లోనే ఉండాలని అనవసరమైన వాటి కోసం వీధుల్లో తిరగవద్దు అని కోరారు మరియు పరిసర ప్రాంతాలలో 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ వెహికిల్ ని సీజ్ చేయడం జరుగుతుందని పోలీసువారి హెచ్చరిక వెహికల్ చెకింగ్ ముమ్మరంగా చేపట్టిన ట్రైనీ ఎస్సై కుశక్ కుమార్, ఏ ఎస్ ఐ రాఘవయ్య, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్. ఉసేన్, నాగేశ్వరరావు, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: