ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ- ధర్మపురి అరవింద్, ఈటేల రాజేందర్

Published: Friday June 24, 2022

మెట్ పల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటేల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ, మాజీ కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సునీత వెంకట్, జేయన్ వెంకట్, వెల్లుల్ల గ్రామ ప్రజలు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.