జడ్పి సునీతా రెడ్డి శివరాత్రి జాగరణ

Published: Saturday March 13, 2021
తాండూరులో శివ సహస్రనామ పారాయణ పఠనం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 12 ( ప్రజాపాలన ) : మహాశివరాత్రి సంధర్బంగా జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి గురువారం రాత్రి శివరాత్రి జాగరణ చేశారు. తాండూరు పట్టణంలోని ప్రధాన శివాలయాలయాలను సందర్శించారు. మల్లప్ప మడిగ దగ్గరగల శివాలయంలో జరిగిన  శివపార్వతుల కల్యాణంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి భూకైలాశ్ సందర్శించి అక్కడ పూజలు చేశారు. అటునుంచి తాండూరు భద్రేశ్వర ఆలయంలో జరిగిన శివ సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొని పారాయణం పఠించారు. అనంతరం పాత తాండూరు లోని కోటేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకొని శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్లారు. సునీతారెడ్డి వెనకాల మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, కౌన్సిలర్ శోభారాణి, ఉమ్మడి జిల్లా ఎంపీటీసీలు ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారీ, టీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.