అనాధలను వృద్ధులను ఆదుకోవాలి - కే.కృష్ణ మూర్తి చారి

Published: Saturday March 13, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : సమాజం కోసం ఏదో చేయాలనే తపన, అనాధలకు చేయూత నివ్వాలనే ఉద్దేశ్యం వున్న ప్రతి ఒక్కరూ ఏదేని సందర్భం వచ్చినపుడు ఏదో ఒక రూపంలో అనాధలను, వృద్ధులను ఆదుకోవాలని కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె. కృష్ణ మూర్తి చారి అన్నారు. రామచంద్రాపురం శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కే.కృష్ణ మూర్తి చారి సోదరుడు సుజాత రాజేందర్ చారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అమీన్ పూర్ లోని మహిమా మినిస్ట్రీస్ లోని 150 మంది అనాధలకు, వృద్దులకు మాంసాహార భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా కే.కృష్ణ మూర్తి చారి  మాట్లాడుతూ సమాజంలో ఎందరో మహానుభావులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తమవంతు సాయంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సదుద్దేశంతోనే ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు పేదలను ఆదుకోవాడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునంద కృష్ణమూర్తి చారి, సుజాత రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, మహిమా మినిస్ట్రీస్ సిబ్బంది పాల్గొన్నారు.