మూడు డివిజన్లలో అభివృద్ధి పనులు

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : అభివృద్ధి కోసం ఎల్లప్పుడు తన సహకారం ఉంటాయని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్మాసగూడా లో 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి ఆధ్వర్యంలో నవారు జంగారెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం నాడు కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ..... ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడం లో ఎప్పుడు వెనకడుగు వేయబోము అని, అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డి ఇ అశోక్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, స్థానిక కార్పొరేటర్ రామిడి మాధురి వీరకర్ణ రెడ్డి, బీజేపీ నాయకులు రామిడి శుర్ణ కర్ణ రెడ్డి, కాలనీ వాసులు శ్రీనివాసులు, ఎన్ .రాజిరెడ్డి, జైహింద్ కుమార్, శ్రీ రామ్ రెడ్డి, శ్రావణ్ కుమార్, సుదర్శన్ గుప్త, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, కులకర్ణి, మధుసూదన్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, శశి వర్ధన్ రెడ్డి, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.