మాటూరు పేట దెందుకూరు డాక్టర్లు బదిలీ*మధిర రూరల్

Published: Thursday December 08, 2022
డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) మండలంలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉన్నతాధికారులు నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులుగా పనిచేస్తున్న వెంకటేష్, మధిర ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు అదేవిధంగా దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ ను హైదరాబాదుకు బదిలీ చేశారు. మధిర మండలంలోని ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించి బదిలీ అయిన డాక్టర్లను ఎంపీపీ లలిత ఆధ్వర్యంలో తహసిల్దార్ రాంబాబు ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకితభావంతో పని చేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు