అఖిలపక్ష నాయకులకు

Published: Wednesday March 01, 2023

ప్రజలకు తెలియజేయునది మున్సిపాలిటీ సుందరీకరణ చేయాలి మధిర రూరల్ ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధిమధిర పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ అఖిలపక్ష నేతలకు మరియు పట్టణ ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, మధిర పట్టణ సుందరీకరణలో భాగంగా మధిర ఆర్ ఓ బి బ్రిడ్జి క్రింద మరియు పైన పోల్స్ కి గాని వాల్ పైంట్ ల పైన గానీ మరియు మున్సిపాలిటీ కి సంబందించిన వాల్ పెయింటింగ్ లపై ఏటువంటి ఫ్లెక్సీ లు మరియు పోస్టర్లు అంటించరారదని తెలియజేయనైనది. ఇట్టి నిబంధనలు పాటించనియెడల వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును అని పట్టణ ప్రజలకు తెలియజేస్తునాము. మధిర పట్టణ అభివృద్ధి మరియు సుందరీకరణలో మీరందరూ భాగస్వాములు కాగలరని కోరనైనది.