జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వేము రాములుకు ఘన సన్మానం

Published: Thursday September 09, 2021
మధిర, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగుభాష ఉపాధ్యాయులు వేము రాములుకు 2020 - 2021 విద్యా సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైన సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరపున మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృత్తిపట్ల అంకిత భావంతో పని చేసినప్పుడు గుర్తింపు అనేది తప్పకుండా వస్తుందని, అలాంటి అంకితభావం కలిగిన వారు వేము రాములు అని చెప్పారు విద్యార్థులకు పాఠాలతో పాటు కవితలు నాటికలు తాను రాయడమే కాకుండా, విద్యార్థుల చేత రాయిస్తున్నారని, ఇలాంటి అవార్డులు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు పొందాలని ఆకాంక్షించార గ్రామ సర్పంచి మేడిశెట్టి లీలావతి మాట్లాడుతూ మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడిపల్లి శ్రీనివాసరావు, కంచి పోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, మహమ్మద్ చాంద్ బేగం, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.