మధిర మున్సిపాలిటీ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Published: Tuesday February 08, 2022
మధిర ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ ముందు సిపిఎం పార్టీ మధిర పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడుధర్నా నిర్వహించారు. సిపిఎంం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ కోటర్స్ లోనే నివాసం ఉంటున్న వారికి మిగతావారీ కల్పించిన మాదిరిగానే ఇంటి నెంబర్ హక్కును కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. అనంతరం "మిగతా వారికి హక్కును కల్పించినందుకు" మధిర సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరుపున  కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, శీలం నరసింహారావు, కట్టా. గాంధీ, పడకండి మురళి, రాధాకృష్ణ, అనుమోలు భాస్కరరావు, సుందరయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు