సమాచార హక్కు పరిరక్షణ సమితి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాండ్ల శ్రీనివాస్
Published: Monday October 03, 2022
మంచిర్యాల టౌన్,అక్టోబర్ 02, ప్రజాపాలన : సమాచార హక్కు పరిరక్షణ సమితి మంచిర్యాల మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ , సంయుక్త కార్యదర్శి గా వేముల రమేష్ లను నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ ఉత్తరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ వైద్య శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు డా'' రెవెల్లి రాజలింగు, ఉపాధ్యక్షులు మాదాసు వెంకటేశ్వర్లు, నస్పూర్ మండల అధ్యక్షుడు రామిల్ల రాజేష్ చేతులమీదుగా నూతనంగా నియమించబడిన వారికి నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటకు తీసీ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని, అదే విధంగా నాపై నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యత నాకు అప్పగించినందుకు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు.
Share this on your social network: