ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి- డాక్టర్ మణి కంఠ రెడ్డి అశ్వాపురం మండలం
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఆశ్వాపురం మండలం నందు ఐటీడీఏ భద్రాచలం వారి సహకారంతో వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల గొంది గూడెం గ్రామంలో ప్రత్యేక వైద్య నిపుణుల చేత తేదీ 11.10.2022 అనగా మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడును ఈ వైద్య శిబిరం నందు ఎంతో అనుభవం కలిగిన స్త్రీల వైద్య నిపుణులు చిన్న పిల్లల వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు చెవి గొంతు వైద్య నిపుణులు సాధారణ వైద్య నిపుణులు మరియు కీళ్లు ఎముకల వైద్యులు కూడా పాల్గొనిదరు మరియు అవసరమైన గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయబడును అలాగే వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వబడును కావున ఈ యొక్క అవకాశాన్ని మండల ప్రజలు అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మణికంఠ రెడ్డి ఈ ప్రకటనలో తెలిపారు.
Share this on your social network: