కరోనా వచ్చినంత మాత్రాన ఎవరూ అధైర్యపడవద్దు.డా కోట రాంబాబు

Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం జాలిముడి గ్రామంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవ్వడంతో వారందరికీ ఈరోజు కె వి ఆర్ హాస్పిటల్ అధినేత డా.కోట రాంబాబు పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారందరికీ శాచురేషన్ లెవల్స్ మరియు బాడీ టెంపరేచర్ లెవల్స్ పరీక్షించి కొంచెం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నవారిని మధిర గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. ఎవరూ కూడా భయపడవద్దని, ధైర్యముగా ఉండి సరైన పోషకాహారం తీసుకుంటూ ఇళ్లకే పరిమితమై ఉండాలని డా.రాంబాబు గారు సూచించారు. అనంతరం వారికి పండ్లు, మాస్కులు మరియు శానిటైజర్ పంపిణీ చేసి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొగ్గులు భాస్కర్ రెడ్డి గారు, సెక్రెటరీ మధు గారు, మాజీ ఎంపిటీసి రాజశేఖర్ గారు, ఆషా వర్కర్స్ మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....