మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్

Published: Monday August 08, 2022

బోనకల్, ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదివారం పర్యటించి పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ముందుగా జానకిపురం ఏఎన్నార్ గార్డెన్స్ లో జరుగుతున్నటువంటి చావా వెంకటేశ్వరరావు  మనవళ్ళ పంచ కట్టు వేడుకలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం గార్లపాడు ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు  దేవుడి మోక్కుల కార్యక్రమానికి హాజరై వారిని అభినందించారు. అదేవిధంగా గోవిందపురం ఎల్ గ్రామంలో జరుగుతున్నటువంటి వార్తాపత్రిక సీనియర్ జర్నలిస్ట్ తమ్మారపు వెంకటేశ్వర్లు కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, బోనకల్ గ్రామ సహకార సంఘం అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు కరివేద సుధాకర్, టిఆర్ఎస్ బోనకల్ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బోనకల్ గ్రామ రైతుబంధు కన్వీనర్ మోర్ల నరసింహారావు, బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ, టిఆర్ఎస్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు, పారా ప్రసాద్ సంబంధిత గ్రామాల వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.