వైఎస్ఆర్ టీపీ జీహెచ్ఎంసీ మహిళా కో ఆర్డినేటర్ గా కల్పన గాయత్రి

Published: Monday August 29, 2022
మేడిపల్లి, ఆగస్టు28 (ప్రజాపాలన ప్రతినిధి)
 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కో ఆర్డినేటర్ గా ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన కల్పన గాయత్రి నియమితులయ్యారు. ఈ మేరకు        వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల జీహెచ్ఎంసీ మహిళా కో ఆర్డినేటర్గా కల్పన గాయత్రీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కల్పన గాయత్రి మాట్లాడుతూ పార్టీ నాయకులందరినీ కలుపుకపోతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని జీహెచ్ఎంసీ పరిధిలో బలోపేతం చేయడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు పార్టీ అధినేత్రి షర్మిలను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.