పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విజిలెన్స్ అధికారి
Published: Saturday March 26, 2022
ఇబ్రహీంపట్నం, మార్చి 25 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విజిలెన్స్ అధికారి చిన్నయ్య పాఠశాల పరిసరాలు తరగతి గదులు పరిశుభ్రంగా వుండడం పట్ల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాసరెడ్డి నీ అభినందించారు ఆయన విద్యార్థుల తో మాట్లాడుతూ తరగతి గదులు పాఠశాల పరిసరాలు శుబ్రంగా వుంచుకున్నట్లే మీ ఇల్లు, వార్డులు శుబ్రంగా వుంచడం ద్వారా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా ఉండటానికి మీరు మీ తల్లిదండ్రులను చైతన్య పరచాలని విద్యార్థులకు తెలిపారు గ్రామంలో స్వచ్ఛ వార్డ్ లను ఎంపిక చేసి బహుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా సర్పంచ్ కు సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల తుకారాం, ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాకేష్ పాల్గొన్నారు
Share this on your social network: