45 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలి

Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు విజ్ఞప్తి45 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు కోరారు . గురువారం మాటూరు పీ హెచ్ సీ లో 2 వ డోస్ వాక్సిన్ వేయించుకున్న బెజవాడ రవి మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు విధిగా కరోనా వాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. కరోనా విజ్రుంబిస్తున్న తరుణంలో మధిర ప్రాంతంలో కూడా రోజు రోజు కు కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి అపోహలు, భయాందోళన చెందకుండా  కరోనా వాక్సిన్ వేయించుకోవాలని ఆయన మధిర పట్టణ, మండల ప్రజలను కోరారు.