ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

Published: Tuesday April 12, 2022

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మున్సిపల్ కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నటికీ పాటుపడిన దీనిజన బంధావుడు మహిళా విద్యభివృద్ధికి మార్గదర్శిగా సమసమాజ స్థాపనలో భవితరాలకు నిత్యం స్ఫూర్తి ప్రధాతగా నిలిచి సమాజంలో కులపారమైన వివక్షతను అన్యాయాలను రూపుమాపడానికి జీవితాన్ని ధారపోసిన మహాత్మా జ్యోతిరావు పూలె జయంతి సందర్బంగా సోమవారము రోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్  కప్పరి స్రవంతి చందు వైస్ చేర్మన్ ఆకుల యాదగిరి, మరియు కౌన్సిలర్ సుల్తాన్, మరియు మున్సిపాలిటీ కమిషనర్ యూసుఫ్, అశోక్, ఫిరోజ్, మున్సిపాలిటీ సిబ్బంది మహాత్మ జ్యోతిరావు పూలె జయంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు.