ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ పై చర్యలు తీసుకోవాలి. ..డిసిపి కి పిర్యాదు చేసిన బిఎస్పీ నాయకులు. మం

Published: Friday October 07, 2022

బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్  పై చర్యలు తీసుకోవాలని ఆపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డిసిపి కార్యాలయంలో పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా బి ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు కాదాసీ రవీందర్  మాట్లాడుతూ బిజెపి పార్టీ వద్ద డబ్బులు తీసుకొని కోవర్టుగా పనిచేస్తున్నాడని తమ పార్టీ రాష్ట్ర అద్యక్షుడి పై తప్పుడు ఆరోపణలు చేశాడని అన్నారు. అదేవిధంగా కరీంనగర్ లో ఎస్పీగా పని చేసినప్పుడు 200 మందిని అకారణంగా చంపినాడని అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు . దీనిని బహుజన సమాజ్ పార్టీ  మంచిర్యాల జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేసిన గ్యాదరి కిషోర్ పై పరువు నష్టం దావా కేసు నమోదు చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పీ జిల్లా ఇన్చార్జీలు ఆవునూరి రవీందర్,కొంతం రాజు, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి తుంగపిండి రమేష్, మంచిర్యాల టౌన్ నాయకులు మడిపల్లి రాములు, హాజీపూర్ మండల నాయకులు చెన్న సాగర్, చిప్పకుర్తి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.