ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించిన లక్ష్మీ నరసింహారావు మనవరాలు మధిర విద్యార్థి

Published: Saturday December 18, 2021
మధిర డిసెంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : మధిర కు చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు మనవరాలు బొలిశెట్టి వెంకట నారాయణ గుప్తా చంద్రిక ల కుమార్తె నిహిత ఈ సంవత్సరం జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానంలో నిలిచారు చిన్నప్పటి నుంచి విద్యలో ఏకాగ్రతతో చదవటమే మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం తన ఈ విజయానికి కారణం అని తెలియజేశారు.. తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాల్వంచ లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చీఫ్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు ఈమె ఉత్తీర్ణత పట్ల తాత ఇతర బంధువులు, స్కూలు యాజమాన్యం, మరియు వాసవి క్లబ్ మధిర వారు శుభాకాంక్షలు తెలియజేశారు.