రామంతాపూర్లో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలును ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Friday December 09, 2022
మేడిపల్లి, డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ డివిజన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాలును గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పూజ కార్యక్రమాలు గావించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఉప్పల్ సర్కిల్లోని నాలుగు డివిజన్లకు గాను రామంతాపూర్ డివిజన్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు సహకరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజకి మరియు అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫంక్షనల్ నిర్మించిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సాంకేతిక కారణాలవల్ల ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అయిందని అన్నారు. కోవిడ్ సమయంలో వాక్సినేషన్ కోసం ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. ఈ ఫంక్షన్ హాల్ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా సరే పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అన్నారు. దానికి సంబంధించి తక్కువ రుసుము రూ 11,200/ జిహెచ్ఎంసి పేరున డిడి రూపంలో చెల్లించి బుక్ చేసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, అరవింద నగర్, గాంధీనగర్, నేతాజీ నగర్, శ్రీరామ కాలనీ మరియు తదితర కాలనీలా అసోసియేషన్ సభ్యులు, ప్రజలు   పాల్గొన్నారు.