ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలి: ఎంపీడీవో, మండల ఎంపీపీ

Published: Monday October 03, 2022
బోనకల్, అక్టోబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి: జాతిపిత మహాత్మా గాంధీ154వ జయంతి వేడుకలను మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమర యోధుడుగా, అహింసావాదిగా, యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన వక్తిత్వం కలిగిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. గాంధీ సిద్ధాంతాలు, నినాదాలను మరోసారి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలని తెలియజేశారు. అదేవిధంగా ఆళ్ళ పాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు జాతిపిత చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కలకోట గ్రామంలో పీసీసీ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఉమా, ఏపీఓ బసవోజ్ కృష్ణకుమారి, ఈ ఓ ఆర్ డి శాస్త్రి, మండల పరిషత్ అధికారులు, ఈజీఎస్, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.