జన్మదిన వేడుకలు జరుపుకొన్న కంచిపోగు శ్రేష్ఠ జాస్మిన్

Published: Tuesday April 26, 2022
మధిర ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు సేవా సదనం లో డాక్టర్ వసంతమ్మ సేవా సదనం లో మాటూరు ఉన్నత పాఠశాల బౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కంచిపోగు ఆదాము  కుమార్తె చిన్నారి కంచిపోగు శ్రేష్ఠజాస్మిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మానసిక దివ్యాంగులకు అన్నదానం చేశారు. అనంతరం మానసిక దివ్యాంగుల మధ్య శ్రేష్ఠ జాస్మిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీ కంచిపోగు ఆదాము మాట్లాడుతూ మానసిక దివ్యంగుల మధ్య నా కుమార్తె జన్మదినవేడుకలుజరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జన్మదిన వేడుకలకు చేసే విధా ఖర్చుతో 10 మంది నిరుపేదల ఆకలి తీర్చవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కంచిపోగు ముత్తయ్య, కంచిపోగు ఆదాము, ప్రమీల, విశిష్ట దీప్ వారి కుటుంబ సభ్యులు సేవా సదనం కేర్ టేకర్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.