భూస్వామ్య వ్యవస్థ పై పోరాటం చేసిన వనిత చాకలి ఐలమ్మ సర్పంచులు భూక్యా సైదా నాయక్, ఉమ్మినేని బా
Published: Tuesday September 27, 2022
బోనకల్, సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి : చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలను మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బోనకల్, గోవిందపురం ఎల్, ఆళ్ళపాడు గ్రామ పంచాయతీలలో సర్పంచులు భూక్యా సైదా నాయక్, ఉమ్మనేని బాబు, మర్రి తిరుపతిరావు ,వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కార్యదర్శి దామల్ల కిరణ్ కుమార్ లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలమ్మను అలుపెరుగని వీరవనిత గా అభివర్ణించారు. భూమికోసం, భుక్తి కోసం భూస్వామ్య వ్యవస్థపై సాయుధ పోరాటం చేసిన మహిళా యోధురాలని గుర్తు చేశారు. దొర, దొరసాని అనే పిలుపులకు స్వస్తి పలకాలని గొంతెత్తి పిలుపునిచ్చి, నాటి బడుగు బలహీన వర్గాలలో చైతన్యం తెచ్చిన వీర వనితగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసయ్య శాస్త్రి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: