ఇంటింటికి ఫీవర్ సర్వే పరిశీలన

Published: Monday January 24, 2022

రాయికల్, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం లోని భూపతిపుర్, రామాజిపెట తదితర గ్రామాలలో ఇంటింటికి జరుగుతున్న ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని రాయికల్ తహసిల్దార్ కుందారపు మహేశ్వర్ పరిశీలించారు. ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేసుకొని ఫీవర్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించి వారికి మందులు ఇవ్వాలని అలాగే వాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని గ్రామాల్లో తిరిగే సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా గ్రామ ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, వీఆర్వో లు వీఆర్ఏ లు పాల్గొన్నారు.