ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Published: Wednesday December 08, 2021
కాగజ్ నగర్ డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం రోజున ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారని హరీష్ రావు తెలిపారు. 66 మందిని పరీక్షించగా అందులో 39 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని, అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించ బడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఫౌండేషన్ అధ్యక్షులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.