జైభారత సైనిక త్రివిధ దళాధిపతి కి ప్రగాఢ శ్రద్ధాంజలి

Published: Tuesday December 14, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఇటీవల విమాన ప్రమాదంలో చనిపోయిన భరతమాత ముద్దబిడ్డ, యుద్ద వీరుడు, భారత త్రివిధ దళాధిపతి భిపిన్ రావత్, తన భార్య, 13 మంది సైనికుల అకాల మరణానికి చింతిస్తూ స్థానిక నాచుపల్లి గ్రామం పంచాయతీ అధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి, ప్రగాఢ సానుభూతి తెలిపి శ్రద్దాంజలి ఘటిచారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిపిన్ రావత్ అకాల మరణం దేశానికి తీరనిలోటు అని ఆయన జీవితాంతం సైనిక ఉద్యోగంలో ఉండి దేశ రక్షణలో జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి అని ఆయన చేసిన సేవలు సదా చిరస్మరణీయం ఆని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు, ఈ కార్యక్రమంలో అంబటి తిరుమలేష్ గాజుల నరేష్ గౌడ్ పిట్టల శ్రీనివాస్ పసునూరి మురళి ఆకునూరి ధర్మరాజు ఆకునూరు తిరుపతి దొంతర వేని నరసయ్య తదితరులు లు పాల్గొన్నారు.