పెట్రోల్ డీజిల్ పై వ్యాటును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి : కొల్లు బాలరాజు

Published: Friday December 03, 2021
మేడిపల్లి, డిసెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అదికారప్రతినిధి కొల్లు బాలరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఉప్పల్ ఆధ్వర్యంలో 4వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు ఉప్పల్ క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై పెట్రోల్, డీజిల్ పై వ్యాటును తగ్గించకుండా అధిక భారాన్ని వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ 4 తేదీన చేపట్టే నిరసన   కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరియు బీజేపీ రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు, ఓబీసీ మోర్చా, బిజెవైయం మహిళా మోర్చా, దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.