బోరు పంపు మరమ్మతులు చేయించిన 12వ వార్డు కౌన్సిలర్

Published: Wednesday May 05, 2021

బెల్లంపల్లి, మే 4, ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో బోరు బావిని మరమ్మత్తులు చేయించి నీటి సౌకర్యం కల్పించామని వార్డు కౌన్సిలర్  నెల్లి శ్రీలత రమేష్ తెలిపారు. మంగళవారం నాడు బస్తీ ప్రజల విజ్ఞప్తి మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసరంగా మున్సిపల్ అధికారులతో మాట్లాడి రామకృష్ణ థియేటర్ వెనకాల వున్న బోరుబావిలో పాడై పోయిన నాలుగు పైపులను కొత్తవి మార్పించి నీటి సౌకర్యం కల్పించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ టిఆర్ఎస్ నాయకులు నెల్లి రమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు, వార్డు ప్రజలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ ఎన్నో నెలలుగా పని చేయకుండా పోయిన బోర్ వెల్ ను బాగు చేయించి నీటి సౌకర్యం కల్పించినందుకు వార్డు కౌన్సిలర్ శ్రీలతకు మరియు టీ ఆర్ ఎస్ నాయకుడు నెల్లి రమేష్ కు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.