12న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Published: Friday September 09, 2022

మధిర  సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు విలేకరుల సమావేశంలో  మధిర మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 12వ తేదీన ఎంపిపి మెండెం లలిత అధ్యక్షత ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన తెలిపారు. సమావేశానికి హాజరయ్యే అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగత నివేదికలను ఒక పేజీకి మించకుండా అందజేయాలని ఆయన పేర్కొన్నారు