రాహుల్ జోడో పాదయాత్రకు భారీగా తరలాలి

Published: Friday October 28, 2022

మధిర అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30న హైదరాబాదుకు రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ పాదయాత్రలో మధిర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ కార్యకర్తల పోరాడాలన్నారు. రైతులను ఉద్యోగులను కార్మికులను వ్యాపారులను ఇలా ప్రతి వర్గాలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాలన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై ఈడి సీబీఐ దాడులతో వేధిస్తుందన్నారు. ఇటువంటి వేధింపులకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ భయపడరన్నారు. లౌకిక భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పాలన చేసిందన్నారు. ప్రస్తుత మోడీ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపై అదనపు భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య డివిజన్ అధ్యక్షులు బండారు నరసింహారావు మాగం ప్రసాద్ కోట నాగరాజు బుల్లెద్దు రాజేందర్ ఆదిమూలం శ్రీనివాసరావు మోదుగు బాబు తదితరులు పాల్గొన్నారు.