బౌద్ధం - వైజ్ఞానిక మార్గం పుస్తకం ఆవిష్కరణ

Published: Thursday October 28, 2021
హైదరాబాద్ అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : కె.కె.రాజా అంజన సంజన అనీల్ సిద్ధోజీ సుభాష్ లతా రాజా ఫౌండేషన్ చైతన్య ఆర్ట్ థియేటర్స్ అభినందనలతో 'బౌద్ధం-వైజ్ఞానిక మార్గం' అనే పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ప్రముఖ రచయిత బౌద్ధధమ్మ విశ్లేషకులు టీవీ వ్యాఖ్యాత శత గ్రంధ కర్త బొర్రా గోవర్ధన్ రచించిన వందవ రచన 'బౌద్ధం - వైజ్ఞానిక మార్గం' పుస్తక ఆవిష్కరణ అక్టోబర్ 29 శుక్రవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు రవీంద్ర భారతిలో జరుగుతుందన్నారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అంజనేయ రెడ్డి మల్లేపల్లి లక్ష్మయ్య మామిడి హరికృష్ణ ఈమని శివనాగిరెడ్డి మొదలగు వారు ఆత్మీయ అతిథులుగా హాజరవుతారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని ఆహ్వానం పలికారు లతా రాజా ఫౌండేషన్.