సమస్యలను పరిష్కరించాలని జడ్సీ రవికిరణ్ కోరిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Published: Friday June 18, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ ని గురువారం నాడు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, నేతాజినగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజి, నీటి సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ రవి కిరణ్ ని కోరారు అనంతరం వినతి పత్రం అందజేశారు. వెంటనే సమస్యలకి స్పందించిన జోనల్ కమిషనర్ రవి కిరణ్ ఏఈ కృషవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ లను రాయదుర్గం, నేతాజి నగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తనిఖీ చేయాలని సూచించారు, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు