క్రీడాకారులకు జెర్సీల బహుకరణ

Published: Thursday March 24, 2022

ఇబ్రహీంపట్నం మార్చి 23 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని ఏర్దడి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కెసిఆర్ కప్పు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా క్రీడాకారులకు టిఆర్ఎస్ ప్రచార కార్యదర్శి ఆర్.ఎం.పి పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి సొంత ఖర్చులతో క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు అనంతరం టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పెంట లింబాద్రి మాట్లాడుతూ. గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు టిఆర్ఎస్ యువ నాయకులు కల్వకుంట సంజయ్ అన్న గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి మండల స్థాయి టోర్నమెంటులో అధిక సంఖ్యలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొని  టోర్నమెంట్ ను విజయవంతం చేయాల్సిందిగా కోరారు అంతేకాకుండా ముఖ్యంగా యువకులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి అని అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు. ఎస్కీల  శ్రీనివాస్. అందుగుల నాగేష్. కానుగంటి సురేష్. గోడిసెల వెంకటేష్. భర్తీపూర్ సర్పంచ్ సంగం సాగర్. క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు.